English | Telugu

పాయల్ రాజ్‌పుత్ పేరు ఇక నుంచి వెంక‌ట‌ల‌చ్చిమి..మరో సంచలనం నమోదు 

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్(Payal rajput).మధ్యలో కొన్ని సినిమాలతో నిరాశపరిచినా కూడా గత సంవత్సరం వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘మంగ‌ళ‌వారం’తో తన స్టామినాని చాటి చెప్పింది.రీసెంట్ గా మరోసారి పాన్ ఇండియా సినిమాతో రావడానికి రెడీ కాబోతుంది.

'వెంక‌ట‌ల‌చ్చిమి' అనే పేరుతో మొత్తం ఆరు భాష‌ల్లో తెరకెక్కుతున్నఈ మూవీ హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.రాజా,ఎన్ఎస్ చౌదరి నిర్మాత‌లు కాగా, ముని దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.ఈ సంద‌ర్బంగా దర్శకుడు ముని(Muni)మాట్లాడుతు 'వెంక‌ట‌ల‌చ్చిమి’గా క‌థ అనుకున్న‌ప్పుడే పాయల్ రాజ్‌పుత్ స‌రిగ్గా స‌రిపోతార‌నిపించింది.ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన‌ ఈ రివేంజ్ డ్రామా ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం.తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో పాన్ ఇండియా లెవల్లో తెర‌కెక్కిస్తున్నామని చెప్పాడు.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతు మంగ‌ళ‌వారం సినిమా త‌ర్వాత ఎన్నో క‌థ‌లు విన్నాను.కానీ న‌చ్చ‌క‌పోవడంతో రిజెక్ట్ చేశాను.అలాంటిది ముని గారు ‘వెంక‌ట‌ల‌చ్చిమి’ క‌థ చెప్ప‌గానే చాలా బాగా నచ్చింది.ఈ సినిమా త‌ర్వాత నా పేరు ‘వెంక‌ట‌ల‌చ్చిమి’గా స్థిర‌ప‌డిపోతుందేమో అనే అంత బ‌ల‌మైన స‌బ్జెక్టు.నా కెరీర్‌కి నెక్ట్స్ లెవ‌ల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుంద‌నే న‌మ్మ‌కం ఉందని చెప్పింది.యూత్ ఆడియ‌న్స్‌కు ఫేవ‌రేట్ హీరోయిన్‌గా మారిన పాయల్ కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్‌తో 'వెంక‌ట‌ల‌చ్చిమి' లాంటి పాన్ ఇండియా సినిమా చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వికాస్ బడిశా సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇతర నటీ నటీ నటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.