English | Telugu

'అఖండ-2'లో సంయుక్త మీనన్.. ప్రగ్యా జైస్వాల్ ను పక్కన పెట్టేశారా..?

తెలుగునాట నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. వీరి కాంబోలో ఇప్పటిదాకా 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు రాగా.. మూడు ఒక దానిని మించి ఒకటి ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా 'అఖండ' సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు వీరి కలయికలో 'అఖండ 2 - తాండవం' రూపొందుతోంది. అసలే బాలయ్య-బోయపాటి కాంబినేషన్, దానికితోడు 'అఖండ' సీక్వెల్ కావడంతో.. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. (Akhanda 2)

'అఖండ-2' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 'అఖండ'లో బాలకృష్ణ సరసన నటించిన ప్రగ్యా జైస్వాల్.. సీక్వెల్ లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సడెన్ గా 'అఖండ-2'లో సంయుక్త మీనన్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారా? లేక ప్రగ్యా జైస్వాల్ స్థానంలో సంయుక్త మీనన్ ను తీసుకున్నారా? అనే స్పష్టత రావాల్సి ఉంది. అయితే 'అఖండ'లో బాలయ్య భార్యగా ప్రగ్యా నటించడంతో, సీక్వెల్ లో ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకునే అవకాశం దాదాపు ఉండదనే చెప్పాలి. ఈ లెక్కన మరో హీరోయిన్ పాత్ర కోసం సంయుక్తను రంగంలోకి దింపి ఉండొచ్చు.

బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట 'అఖండ-2'ని నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.