English | Telugu

షిర్డీలో నాగార్జున దంపతులు

అక్కినేని నాగార్జున ఆయన సతీమణి శ్రీమతి అక్కినేని అమల కలసి షిర్డీలోని సాయిబాబాని సందర్శించుకున్నారు. నాగార్జున తండ్రి నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారు నాస్తిక వాది.అంటే ఆయన దేవుణ్ణి నమ్మరు. కాని నాగార్జున దేవుణ్ణి నమ్ముతారు.

నాగార్జున సాయిబాబాని సందర్శించిన అనంతరం అక్కడి విలేఖరులు "మీరు షిర్డీకి ఇంతకు ముందు వచ్చారా...?" అని అడగ్గా, దానికి నాగార్జున " లేదండీ. ఇదే మొదటి సారి రావటం. బాబాని దర్శించుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది" అని అన్నారు.

విలేఖరులు "మీరు బాబాని ఏం కోరుకున్నారు...?" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగార్జున "ఏం కోరుకోలేదండీ... నేను అడక్కుండానే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. అందుకే బాబాకి మనసారా నమస్కరించుకున్నాను".అని అన్నారు. విలేఖరులు " మీకు బాబాని చూడాలని ఎందుకనిపించింది....?" అన్న ప్రశ్నకు సమాధానంగా నాగార్జున " ఈ రోజు ఉన్నట్టుండి బాబాని చూడాలనిపించింది. అంతే వెంటనే వచ్చేశాను. ప్రత్యేకంగా కారణమంటూ ఏం లేదు" అని అన్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.