English | Telugu

యాభై రూపాయల జీతం ఇచ్చారు.. మరి ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడుగా!

'బాహుబలి' సిరీస్ తో తెలుగు సినిమా పరిశ్రమకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టిన దర్శక ధీరుడు రాజమౌళి(ss Rajamouli). ఆర్ ఆర్ ఆర్(RRR)తో అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ ని కూడా తెచ్చిపెట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో తన కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే హయ్యస్ట్ బడ్జెట్ తో రుదిద్దుకోబోతుంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే రెండో షెడ్యూల్ ని జరుపుకోనుంది.

రాజమౌళి రీసెంట్ గా నిన్న జరిగిన నాగార్జున(Nagarjuna),ధనుష్(Dhanush)ల 'కుబేర'(Kuberaa)మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళిని ఉద్దెశించి ఈవెంట్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమ మాట్లాడుతు 'మీ ఫస్ట్ శాలరీ ఎంత అని అడిగింది. దీంతో రాజమౌళి సుమతో యాభై రూపాయిలని చెప్పాడు. రాజమౌళి చెప్పిన ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కెరిరీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'స్టూడెంట్ నెంబర్ వన్' చిత్రం ద్వారా రాజమౌళి సినీ రంగానికి పరిచయమయ్యాడు. సినిమా రంగంలోకి రాక ముందు సీరియల్స్ కి కూడా వర్క్ చేసాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.