English | Telugu

జోస్ అలూక్కాస్ షోరూం లాంచ్ చేసిన మహేష్ బాబు

మహేష్ బాబు "జోస్ అలూక్కాస్" షోరూం లాంచ్ చేశారు. వివరాల్లోకి వెళితే కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరీలలో 24 షోరూములున్న ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ "జోస్ అలూక్కాస్" తమ 25 వ షోరూమ్ ని హైదరాబాద్ పంజాగుట్టలో ప్రారంభించింది. అయితే "జోస్ అలూక్కాస్" సంస్థ యమ్.డి. ఈ షోరూమ్ ని ప్రముఖ తెలుగు హీరో ప్రిన్స్ మహేష్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

"జోస్ అలూక్కాస్" సంస్థ తమషోరూమ్ లను ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు విస్తరింపజేయాలని ప్రయత్నిస్తూందనీ, ఆ ప్రయత్నంలో భాగంగా విజయవాడ, విశాఖపట్టణం వంటి నగరాల్లో కూడా తమ షోరూమ్ లను ప్రారంభిస్తామని ఆ సంస్థ యమ్.డి. మీడియాకు తెలిపారు. ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట కలసి నిర్మిస్తున్న"దూకుడు" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.