English | Telugu

రామ్ హీరోగా,గౌతమ్ మీనన్ చిత్రం జూన్ 25 నుండి

రామ్ హీరోగా,గౌతమ్ మీనన్ చిత్రం జూన్ 25 నుండి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే స్రవంతి రవికిశోర్ సమర్పణలో, శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, యువ హీరో రామ్ హీరోగా, సమంత హీరోయిన్ గా, గౌతమ మీనన్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సినిమా జూన్ 25 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ గా నిర్మించబడుతూంది.

ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తారు. గతంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా నటించిన "ఏమాయ చేశావే" సినిమాకి కూడా ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందించారు. ఎ.ఆర్.రెహమాన్, గౌతమ్ మీనన్, సమంతల కాంబినేషన్ లో వస్తున్న ద్వితీయ చిత్రమిది కావటం విశేషం. ఈ సినిమాని జూన్ 25 వ తేదీన ఘనంగా ప్రారంభించనున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.