English | Telugu

'ఆగడు' కోసం కష్టపడుతున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన టార్గెట్ రిచ్ కావడం కోసం తెగ కష్టపడుతున్నాడట. 'ఆగడు' సినిమాని ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నామని మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ డేట్ ని రీచ్ అయ్యేందుకు మహేష్ తో సినిమా యూనిట్ కూడా కష్టపడుతున్నారట. గత మూడు రోజులుగా మహేష్ ఈ సినిమాకి కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్నారు. శ్రీను వైట్ల కూడా దగ్గరుండి డబ్బింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకు౦టున్నారట. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.‘ఆగడు’కి కూడా థమన్‌ తన బెస్ట్‌ వర్క్‌ అందించినట్టే అనిపిస్తోంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.