English | Telugu

ఎన్టీఆర్ కి రెస్ట్ ఇచ్చిన పూరి

గత కొంతకాలంగా వరుస షూటింగ్ లతో బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి డైరెక్టర్ పూరిజగన్నాథ్ రెస్ట్ ఇచ్చారట. పూరి సినిమా నుంచి కొంచెం విరామం దొరకడంతో తన ముద్దుల తనయుడు ‘అభయ్ రామ్’ తో జూనియర్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తిరిగి త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం. అయితే ఎన్టీఆర్ రెస్ట్ తీసుకున్న పూరి మాత్రం షూటింగ్ తో బిజీగా వున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రికరిస్తున్నాడట. ఈ సినిమాను ఎలాగైన స౦క్రాంతికి రిలీజ్ చేయాలననే పట్టుదలతో చిత్రీకరణ వేగవంతం చేసాడ౦ట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.