English | Telugu

నిరుడు `ఉప్పెన‌`.. ఈ ఏడాది `డీజే టిల్లు`..!

గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యాల్లో `ఉప్పెన` ఒక‌టి. వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టిని హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమా.. 2021 ఫిబ్ర‌వ‌రి 12న తెర‌పైకి వ‌చ్చింది. ఈ చిత్రంతోనే సుకుమార్ వ‌ద్ద శిష్య‌రికం చేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేశాడు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మెమ‌ర‌బుల్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Also Read:లతా మంగేష్కర్ భౌతికకాయం వద్ద షారుఖ్ ఉమ్మేశాడా.. అసలు నిజమేంటి?

క‌ట్ చేస్తే.. ఈ ఏడాది కూడా అదే ఫిబ్ర‌వ‌రి 12న మ‌రో కొత్త ద‌ర్శ‌కుడు అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు. అత‌డే.. విమ‌ల్ కృష్ణ‌. యువ క‌థానాయ‌కుడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన `డీజే టిల్లు`తో విమ‌ల్ కెప్టెన్ గా అరంగేట్రం చేస్తున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ నిర్మించింది. మ‌రి.. గత ఏడాది పాపుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన‌ `ఉప్పెన‌`తో ఎలాగైతే డెబ్యూ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు మంచి విజ‌యం అందుకున్నాడో.. అలాగే ఈ ఏడాది మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసిన `డీజే టిల్లు`తో నూత‌న ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ కూడా శుభారంభం అందుకుంటాడేమో చూడాలి.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.