English | Telugu

స‌మంత అస‌లు రంగు బ‌య‌ట‌పడిందా??

స‌మంత ఇంటిపై ఐటీ అధికారుల దాడి.. షాక్‌కి గురిచేయ‌లేదు. తెలుగు, త‌మిళ నాట స‌మంత టాప్ లీడ్‌లో ఉన్న హీరోయిన్‌. కోట్ల‌కు కోట్లు పారితోషికం తీసుకొంటున్న క‌థానాయిక‌. సో.. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారుల దృష్టి స‌మంత లాంటి క‌థానాయిక‌ల‌పై ప‌డ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యం కాదు. అయితే.. స‌మంత ఇంట్లో దొరికిన కీల‌క పత్రాలు, స‌మంత మేనేజ‌ర్ ద‌గ్గ‌ర దొరికిన డాక్యుమెంట్లు ఐటీ అధికారుల‌కు షాక్‌ని గురి చేశాయ‌ని స‌మాచారం.

స‌మంత కొన్ని వెంచెర్ల‌లో భారీగా పెట్టుబ‌డి పెట్టింద‌ని, అందుకు సంబంధించిన ఆధారాలు ఐటీ వాళ్ల ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని తెలుస్తోంది. స‌మంత ఛారిటీ పేరుతో కొన్ని సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. దాంతో పాటు ప‌న్ను కూడా స‌జావుగానే క‌డుతోంది. అయితే.. స‌మంత గుట్టుగా చేస్తున్న 'వ్యాపారాల‌' తాలుకూ లావాదేవీల సంగ‌తి.. ఐటీ వాళ్ల చేతికి చిక్కింద‌ని టాక్‌. నిన్నా మొన్న‌టి వ‌రకూ 'వ్యాపారాలు చేసేంత సొమ్ము నా ద‌గ్గ‌ర లేదు..' అంటూ బుకాయించిన స‌మంత అస‌లు రంగు ఈ ఐటీ దాడితో బ‌య‌ట‌ప‌డింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దానికి తోడు మ‌రో షాకిచ్చే విష‌యం ఏమిటంటే.. స‌మంత త‌న ఇంట్లో వాళ్ల‌తో స‌రిగ్గా ఉండ‌డం లేద‌ట‌. అమ్మానాన్న‌ల ద‌గ్గ‌ర కాకుండా వేరేగా ఉంటోంద‌ని టాక్‌. తాను ఇంటికి వెళ్లి చాలా రోజులైంద‌ని టాక్‌. త‌ల్లిదండ్రుల‌తో స‌మంత సంబంధాలు బెడ‌సి కొట్టాయ‌న్న విష‌యం ఐటీ అధికారుల‌కు స‌మంత తండ్రి జోస‌ఫ్ ఇచ్చిన స‌మాధానాల బ‌ట్టి అర్థ‌మైంద‌ని వినికిడి. మ‌రి వీటిపై స‌మంత ఎలాంటి స‌మాధానం చెబుతుందో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.