English | Telugu

12 ఏళ్ళ తర్వాత గోపీచంద్ సాహసం.. హిట్ కొడతాడా?

కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న మాచో స్టార్ గోపీచంద్‌ (Gopichand).. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించాడు. తాజాగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో గోపీచంద్‌ ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ బ్యానర్ లో 'సాహసం'(2013) వంటి విభిన్న చిత్రంతో మెప్పించాడు గోపీచంద్. 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ చిత్రం, గురువారం (ఏప్రిల్ 24) నాడు అధికారికంగా ప్రారంభమైంది.

బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. థ్రిల్లింగ్ కథాంశంతో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం రాబోతోందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మలయాళ నటి మీనాక్షి దినేష్ కథానాయికగా నటించనుంది. సినిమాటోగ్రాఫర్ గా శామ్‌దత్ వర్క్ చేయనున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.