English | Telugu
నిధి అగర్వాల్ తో సహా ఇంకో 28 మందిపై ఈడి కేసు నమోదు
Updated : Jul 10, 2025
నిధి అగర్వాల్(Nidhhi Agerwal),రానా దగ్గుబాటి(Rana Daggubati)మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్, ప్రణీత, అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీ ముఖి, వర్షిణి, శోభాశెట్టి, వాసంతి కృష్ణన్, నయని పావని, శ్యామల, రీతూ చౌదరి, టేస్టీ తేజ, శేషయాని ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులు మరియు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ సుమారు ఇరవై తొమ్మిది మంది సోషల్ మీడియాలో వచ్చే పలు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోటర్స్ గా చేసారు. దీంతో కొన్ని రోజుల క్రితం సైబారాబాద్ పోలీసులు వాళ్ళందరిపై ఎఫ్ఐఆర్ ని నమోదు చేసారు.
రీసెంట్ గా సైబారాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని ఆధారంగా చేసుకొని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) ప్రమోటర్స్ అందరిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించింది. బెట్టింగ్ యాప్ ల ద్వారా పలువురు సెలబ్రటీస్ కి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్టుగా ఆధారాలు లభించాయి. అయితే ఆ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది. పన్ను చెల్లింపులు, బిల్లింగ్ వివరాలపై కూడా విచారణ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ఈడి పలువురు నివాసాల్లో సోదాలు కూడా జరపవచ్చనే టాక్ వినపడుతుంది.
ఇక తమపై బెట్టింగ్ యాప్ కి సంబంధించి కేసులు నమోదు కాగానే, చాలా మంది మాట్లాడుతు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి తప్పు చేశామని, ఇంకెప్పుడు చెయ్యమని చెప్పడం జరిగింది.