English | Telugu

నిధి అగర్వాల్ తో సహా ఇంకో 28 మందిపై ఈడి కేసు నమోదు  

నిధి అగర్వాల్(Nidhhi Agerwal),రానా దగ్గుబాటి(Rana Daggubati)మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్, ప్రణీత, అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీ ముఖి, వర్షిణి, శోభాశెట్టి, వాసంతి కృష్ణన్, నయని పావని, శ్యామల, రీతూ చౌదరి, టేస్టీ తేజ, శేషయాని ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులు మరియు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ సుమారు ఇరవై తొమ్మిది మంది సోషల్ మీడియాలో వచ్చే పలు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోటర్స్ గా చేసారు. దీంతో కొన్ని రోజుల క్రితం సైబారాబాద్ పోలీసులు వాళ్ళందరిపై ఎఫ్ఐఆర్ ని నమోదు చేసారు.

రీసెంట్ గా సైబారాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని ఆధారంగా చేసుకొని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) ప్రమోటర్స్ అందరిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించింది. బెట్టింగ్ యాప్ ల ద్వారా పలువురు సెలబ్రటీస్ కి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్టుగా ఆధారాలు లభించాయి. అయితే ఆ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది. పన్ను చెల్లింపులు, బిల్లింగ్ వివరాలపై కూడా విచారణ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ఈడి పలువురు నివాసాల్లో సోదాలు కూడా జరపవచ్చనే టాక్ వినపడుతుంది.

ఇక తమపై బెట్టింగ్ యాప్ కి సంబంధించి కేసులు నమోదు కాగానే, చాలా మంది మాట్లాడుతు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి తప్పు చేశామని, ఇంకెప్పుడు చెయ్యమని చెప్పడం జరిగింది.


అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.