English | Telugu

'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ రివ్యూ.. పూరి కమ్ బ్యాక్ ఇచ్చాడా..?

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' 2019 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రామ్ ఎనర్జీ, పూరి మార్క్ డైలాగ్ లు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' (Double ISMART) వస్తోంది. ఆగష్టు 15న విడుదలవుతున్న ఈ మూవీ, తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

'డబుల్ ఇస్మార్ట్' సినిమాకి సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ ఇచ్చారు. రన్ టైం 2 గంటల 42 నిమిషాలు అని సమాచారం. ఈ మూవీకి సెన్సార్ టాక్ పాజిటివ్ గానే వుంది. 'ఇస్మార్ట్ శంకర్' తరహాలోనే మాస్ ప్రేక్షకులు మెచ్చేలా దీనిని మలిచారట. రామ్ క్యారెక్టర్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుందట. ముఖ్యంగా రామ్, సంజయ్ దత్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయని చెబుతున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ లో ఉంటుందట. ఇక డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. సామెతలు, వెటకారం జోడించి తెలంగాణ యాసలో వచ్చే డైలాగ్ లు బాగా పేలాయట. యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలతో రూపొందిన పక్కా కమర్షియల్ మూవీ అని.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఇస్మార్ట్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

ఇది అటు రామ్ అభిమానులకు, ఇటు పూరి అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరు ఫ్లాప్స్ లో ఉన్నారు. మరి ఈ 'ఇస్మార్ట్ శంకర్' కాంబో.. 'డబుల్ ఇస్మార్ట్'తో హిట్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.