English | Telugu

మరో వివాదంలో డింపుల్ హయాతి.. ఒడిశా నుండి యువతులను తీసుకొచ్చి...

సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటుంది హీరోయిన్ డింపుల్ హయతి. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులను ఇంట్లో పనిని పెట్టుకొని.. డబ్బులు ఇవ్వకపోగా, చిత్ర హింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తాయి. వారిని వివస్త్రను చేసి దాడి చేయడానికి, వీడియోలు తీయడానికి ప్రయత్నించారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. (Dimple Hayathi)

డింపుల్ హయాతి, ఆమె భర్త తమ ఇంటి పనులు మరియు పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలని ఒక పరిచయస్తురాలికి చెప్పారట. దీంతో ఆమె ఒడిస్సా నుండి ఇద్దరు యువతులను రప్పించి.. డింపుల్ హయాతి ఇంటికి పంపించింది. డింపుల్ దంపతులు కొన్ని రోజులు వారిని బాగానే చూసుకున్నారట. ఆ తర్వాత ఆ యువతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా.. సడెన్ గా బయటకు వెళ్ళిపోమన్నారట. దీంతో ఆ యువతులు అపార్ట్మెంట్ దగ్గర ఆందోళనకు దిగగా.. డింపుల్ దంపతులు బెదిరింపులకు పాల్పడ్డారట. మాకు చాలా మంది లాయర్లు తెలుసు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరించారట. అంతేకాకుండా, ఆ యువతులను హైదరాబాద్ కి తీసుకువచ్చిన మహిళపై కూడా డింపుల్ దంపతులు ఫైర్ అయ్యారట.

దీంతో ఆ ఒడిశా యువతులు ఫిల్మ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. తమతో వెట్టి చాకిరీ చేపించుకొని.. డబ్బులు ఇవ్వకపోగా, బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగ్నంగా చేసి దాడి చేయడానికి, వీడియోలు తీయడానికి కూడా ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరి డింపుల్ హయాతి దంపతులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.