English | Telugu

'కొరియ‌ర్‌' క‌త్తిరించినా... క‌నిక‌రించ‌లేదు

వాయిదాల ప‌ర్వం దాటుకొని కొరియ‌ర్ బోయ్ క‌ల్యాణ్‌.. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఫ‌స్ట్ షో నుంచే డివైడ్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. ఈ సినిమాపై విడుద‌ల‌కు ముందు నుంచీ ఎలాంటి అంచ‌నాలూ లేవు. కాబ‌ట్టి రిజ‌ల్ట్ కూడా షాకింగ్ అనిపించ‌లేదెవ్వ‌రికీ. అస‌లే రెండుగంట‌ల సినిమా ఇది. అయినా స‌రే.. గౌత‌మ్ మీన‌న్ చివరి క్ష‌ణాల్లో 15 నిమిషాల సినిమాని ట్రిమ్ చేశాడ‌ట‌. దాంతో గంట 45 నిమిషాల సినిమాగా మారింది. ఇంత క‌త్తిరించినా ప్రేక్ష‌కులు మాత్రం క‌నిక‌రించ‌లేదు. చివ‌రి క్ష‌ణాల్లో ట్రిమ్ చేసినా, సినిమా ఇంకా లెంగ్తీగా, బోరీంగ్‌గా త‌యారైందంటే.. ద‌ర్శ‌కుడి స్ర్కీన్ ప్లే ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కొరియ‌ర్ బోయ్‌తో వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్న నితిన్ కి స్పీడ్ బ్రేక‌ర్లు ఎదురైన‌ట్టుంది ప‌రిస్థితి. వాయిదాలు ప‌డుతూ విడుద‌లైన ఏ సినిమా హిట్ అయిన‌ట్టు తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే లేదు. ఆ సెంటిమెంట్ ని కొరియ‌ర్ బోయ్ కూడా కంటిన్యూ చేసింది. !

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.