English | Telugu

టికెట్స్  రేట్స్  తగ్గించి  అదృష్టం పరీక్షించుకుంటున్న అల్లు హీరో  

అల్లు శిరీష్(allu sirish)ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)కి బ్రదర్, స్టార్ ప్రొడ్యూసర్ అరవింద్ కి కొడుకు. 2013 లో గౌరవం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబిసిడి ,ఉర్వశివో రాక్షసీవో వంటి విభిన్న చిత్రాలతో తన కంటు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. లేటెస్ట్ గా బడ్డీ(buddy)తో రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం తెలుగు నాట హాట్ టాపిక్ గా మారింది.

డ్రామా అండ్ యాక్షన్ కామెడీ గా తెరకెక్కుతున్న బడ్డీ అగస్ట్ 2 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది. దీంతో ప్రతి ఒక్కరు బడ్డీని ఆశీర్వదించాలని చెప్పి చిత్ర యూనిట్ టికెట్స్ రేట్స్ ని తగ్గించింది. సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో హై క్లాస్ ని తొంబై తొమ్మిది రూపాయిలుగా,మల్టిప్లెక్స్ లలో నూట ఇరవై ఐదు రూపాయిలుగా ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఈ తగ్గిన రేట్స్ వలన మరింత మంది ప్రేక్షకులు సినిమా చూసే అవకాశం ఉంది. చిత్ర బృందం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే. అదే విధంగా ఫ్యూచర్ లో రాబోయే సినిమాలన్నీ బడ్డీని ఫాలో అవుతాయేమో చూడాలి.

2021 లో ఆర్య హీరోగా తమిళంలో వచ్చిన టెడ్డి మూవీ లైన్ ని తీసుకొని బడ్డీ ని తెరకెక్కించడం జరిగింది.గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా చెయ్యగా శ్యామ్ అంటోన్(sam anton) దర్శకత్వం వహించాడు.తమిళ దర్శకుడు అయిన శ్యామ్ అక్కడ సుమారు ఐదు చిత్రాలకి దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్ పతాకంపై అగ్ర నిర్మాత కె ఈ జ్ఞానవేల్ రాజా(k e Gnanavel Raja)నిర్మించాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.