English | Telugu

బాల‌య్య అంటే భ‌య‌ప‌డుతున్నాడు!



నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు వందో సినిమా క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. చుట్టూ బోల్డ‌న్ని ఆప్ష‌న్లున్నాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో అర్ఠం కావ‌డం లేదాయె. సింగీతం శ్రీ‌నివాస‌రావు, అనిల్ రావిపూడి, బోయ‌పాటి శ్రీ‌ను... ఇలా ద‌ర్శ‌కులు కొంత‌మంది బాల‌య్య హిట్ లిస్టులో ఉన్నారు. ఆదిత్య 999 స్ర్కిప్టు రెడీగా ఉంది. బాల‌య్య ఓకే అన‌డ‌మే ఆల‌స్యం. 'రామారావుగారు' అనే పేరుతో అనిల్ రావిపూడి ఓ పొలిటిక‌ల్ సెటైర్ స్ర్కిప్టుని త‌యారు చేశాడు. అది కూడా బాల‌య్య‌కు భ‌లేగా న‌చ్చింద‌ట‌. కానీ.. బాల‌య్య దృష్టి మాత్రం బోయ‌పాటి శ్రీ‌నుపై ఉంది. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్లు వ‌చ్చాయి. బాల‌య్య ప‌ల్స్ ప‌ట్టేసిన ద‌ర్శకుడిగా బోయ‌పాటికి క్రేజ్ వ‌చ్చింది. అందుకే బాల‌య్య కూడా బోయ‌పాటితోనే సినిమా చేద్దామ‌నుకొంటున్నాడు.

కానీ.. బోయ‌పాటి మాత్రం బాల‌య్య పేరు చెబితే భ‌య‌ప‌డిపోతున్నాడ‌ట‌. రెండు సినిమాల్లోనూ బాల‌య్య‌తో ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా... 'ఆయ‌న‌తో ఎందుకులే రిస్కు' అనుకొంటున్నాడ‌ని టాక్‌. దాంతో `నా ద‌గ్గ‌ర క‌థేం లేదు. నాక్కొంచెం టైమ్ కావాలి` అని త‌ప్పించుకోవ‌డానికి ట్రై చేస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాల‌య్య వందో సినిమా అంటే విప‌రీతమైన ఒత్తిడి ఉంటుంది. అభిమానుల అంచ‌నాల‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్టం. అందుకే... వందో సినిమా విష‌యంలో దూరంగా ఉండాల‌న్న‌ది బోయ‌పాటి ఆలోచ‌న‌. కానీ.. బాల‌య్య మాత్రం 'సినిమా చేస్తావా, లేదా?' అంటూ గ‌ట్టిగానే అడ‌గుతున్నాడ‌ట‌. దాంతో బోయ‌పాటి న‌లిగిపోతున్నాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.