English | Telugu

మలయాళం తర్వాతే తెలుగు..బొమ్మాళీ అనుష్క పరిస్థితి ఇదే  

బొమ్మాళీ అనుష్క గత సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్ డేట్ ఉమెన్ గా చెఫ్ గా ఆమె ప్రదర్శించిన నటన ప్రతి ఒక్కర్నిఎంతగానో ఆకట్టుకుంది. మూవీ కూడా మంచి విజయాన్నే నమోదు చేసింది. దీంతో తను చెయ్యబోయే నెక్స్ట్ మూవీ మీద అందరిలోను ఆసక్తి ఉండటం సహజం.ఈ నేపథ్యంలో తాజా వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

అనుష్క ప్రముఖ దర్శకుడు క్రిష్ తో ఒక మూవీ చెయ్యబోతుందనే వార్తలు ఇటీవల వచ్చాయి.ఆల్రెడీ ఆ ఇద్దరి కాంబోలో వేదం వచ్చి ఘన విజయం సాధించింది.అందులో అనుష్క వేశ్య పాత్రని పోషించింది. దీంతో ఆ ఇద్దరి కమ్ బ్యాక్ మూవీ ఎలాంటి సబ్జెక్టు తో తెరకెక్కనుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఇప్పుడు అనుష్క హఠాత్తుగా ఒక మలయాళ మూవీ కి కమిట్ అయ్యింది. కథనార్ అనే టైటిల్ తో ఆ మూవీ తెరకెక్కనుంది.అనుష్క మలయాళంలో నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.ఆల్రెడీ మూవీ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టింది..ఈ సందర్భంగా టీమ్ తో కలిసి ఆమె దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే అనుష్క నెక్స్ట్ సినిమా మలయాళంలో రిలీజ్ కాబోతుందన్నమాట.

మలయాళ చిత్ర సీమలో వినిపిస్తున్న కథనాల ప్రకారం కథనార్ లో అనుష్క నెగటివ్ రోల్ ని పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. జయసూర్య.వినీత్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా మిగతా నటి నటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సుబ్రమణియన్ మ్యూజిక్ ని అందిస్తుండగా గోకులం గోపాలన్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. రోజిన్ థామస్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.