English | Telugu

కిల్లింగ్ వీరప్పన్...ఔట్ స్టాండింగ్ : అమితాబ్ ట్వీట్

తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడ గడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం 'కిల్లింగ్ వీరప్పన్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.

రీసెంట్ గా సినిమా ట్రైలర్ చూసిన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ 'కిల్లింగ్ వీరప్పన్' ట్రైలర్ నమ్మశక్యం కాని విధంగా ఉందని ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు అమితాబ్ ఒక తెలుగు సినిమా గురించి ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. దీని గురించి రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. ''అమిత్ జీ నేను రియల్ స్టోరీస్ తీయడంలో దిట్ట అని నమ్మే వ్యక్తి. నాకు తెలిసి ఆయనకు సినిమాలో ఉన్న అసాధారణమైన ఊహాచిత్రాలు, ఫిలిం యొక్క ఇంటెన్సిటీ బాగా నచ్చినట్లుంది' అని తన అభిప్రాయం వెల్లడించారు.

శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞాశెట్టి, పరూల్ యాదవ్, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రమ్మీ; సంగీతం:రవిశంకర్, ఎడిటింగ్: అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సధీర్ చంద్ర పధిరి; నిర్మాతలు:బీవి.మంజునాథ్, ఇ.శివప్రకాష్, బిఎస్ సుధీంద్ర; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.