English | Telugu

ప్చ్‌.. మ‌ళ్లీ కొడుకే ముంచేశాడు

అల్లుడు శీను దెబ్బ‌కు ఇంకా తేరుకోలేదు బెల్లంకొండ సురేష్‌. త‌న కొడుకుని పెద్ద హీరో చేయాల‌న్న ఆశ‌యంతో తొలి సినిమాకే ఏకంగా రూ.43 కోట్లు ఖ‌ర్చుపెట్టాడు. పేరున్న టెక్నీషియ‌న్స్‌ని తీసుకొచ్చాడు. హీరోయిన్ల‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడిందంతే. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి ఓపెనింగ్స్ మాత్రం బాగా వ‌చ్చాయి. ఎన్ని టికెట్లు తెగినా... ఆ సినిమా ద్వారా బెల్లంకొండ దాదాపు రూ.10 కోట్లు న‌ష్ట‌పోయాడ‌ని, ఆ దెబ్బ‌తోనే సినిమాల‌కు దూర‌మ‌య్యాడ‌ని టాక్‌.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ కొడుకే ముంచేశాడు. శ్రీ‌నివాస్ రెండో సినిమా స్పీడున్నోడు ఈమ‌ధ్యే విడుద‌లైంది. నిర్మాత‌గా భీమినేని శ్రీ‌నివాస‌రావు పేరున్నా... వెనుక నుంచి డ‌బ్బులు పెట్టింది మాత్రం బెల్లంకొండ సురేషేన‌ట‌. రూపాయి ఖ‌ర్చ‌పెట్టాల్సిన చోట త‌న కొడుకు కోసం ప‌ది రూపాయలు ఖ‌ర్చుపెట్టాడ‌ట‌. దాంతో సినిమా రిచ్‌గా వ‌చ్చింది. రిజ‌ల్ట్ తో తాను మాత్రం `పూర్‌` అయిపోవాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఫైట్లూ, పాట‌లూ, త‌న‌మ‌న్నా రెమ్యున‌రేష‌న్‌,యాడ్లూ.. వీటి కోసం బెల్లంకొండ సురేషే ఖర్చుపెట్టాడ‌ట‌. ఆ మొత్తం ఏకంగా రూ.6 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని టాక్‌. ఇప్పుడు ఈ సినిమాని కొన్న బ‌య్యర్లు తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. వాళ్ల‌కూ ఎంతో కొంత డ‌బ్బు స‌ర్దుబాటు చేయాలి. ఆ బాధ్య‌త కూడా బెల్లంకొండ సురేష్‌పైనే ప‌డింద‌ని టాక్‌. అలా... రెండో సినిమా కూడా ఈ తండ్రీ కొడుకుల‌కు నిరాశ‌నే మిగిల్చింద‌న్న‌మాట‌.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.