English | Telugu

సెంటిమెంట్ ఫాలో అవుతున్న అల్లు అర్జున్- బోయపాటి

ప్రతీ ఒక్కళ్లకూ సెంటిమెంట్లుంటాయి..సినిమావాళ్లకైతే కాస్త ఎక్కువే ఉంటాయి..ఎన్ని సెంటిమెంట్లు ఫాలో అయినా చివరిగా వాళ్లకు కావాల్సింది భారీ హిట్ కొట్టడమే..లేటెస్ట్ గా అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సరైనోడు మూవీకీ ఇలాంటి సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నట్లు సమాచారం.. సరైనోడును ఇంగ్లీష్ లో ' Sarainodu ' అని రాస్తారు..కానీ మూవీ టీం,ఈ పేరులో ఒక అక్షరం ఎక్కువ పెట్టి ' Sarrainodu ' గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారట..న్యూమరాలజీ ప్రకారం ఇలా మారిస్తే భారీ హిట్ కన్ఫామ్ అని ఎవరో చెప్పడంతో అని ఇలా మార్చారట..


ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ' సరైనోడు ' యాక్షన్ లవ్ స్టోరీగా రాబోతోంది..శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో,బన్నీది ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని సమాచారం.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ' సరైనోడు 'కు నెక్స్ట్ షెడ్యూల్ జనవరి 25 నుంచి మొదలవుతుంది..అల్లుఅర్జున్ కు పెయిర్ గా, రకుల్ ప్రీత్ సింగ్,క్యాథరీన్ ట్రెసా నటిస్తున్నారు..శ్రీకాంత్, ఆది పినిశెట్టి స్పెషల్ రోల్స్ తో పాటు, లోఫర్ హీరోయిన్ దిశా పటానీ,ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం విశేషం..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.