English | Telugu

మీడియా అంటే భ‌య‌ప‌డుతున్న ముద్దుగుమ్మ‌లు

గ్లామ‌ర్ ప్ర‌పంచానికి `మీడియా` కావాలి... `మీడియా`కు గ్లామ‌ర్ ప్ర‌పంచం కావాలి. అందుకే ఈ రెండు రంగాలు ఇచ్చిపుచ్చుకొంటుంటాయి. మ‌రీ ముఖ్యంగా క‌థానాయిక‌లు `మీడియా` ముందు హొయ‌లుపోతుంటారు. ఫొటోగ్రాఫ‌ర్లు, కెమెరామెన్లు చుట్టుముడుతుంటే, పాత్రికేయులు త‌మ ఇంట‌ర్వ్యూల కోసం ప‌రుగులు తీస్తుంటే.. క్రేజ్ అనుకొంటుంటారు. మీడియా త‌మ‌కు దూర‌మ‌వుతుందంటే బెంగ పెట్టుకొంటారు. అలాంటిది కొంత‌మంది క‌థానాయిక‌లు మీడియా అంటే `అమ్మ‌బాబోయ్‌` అంటున్నారు. ఇంట‌ర్వ్యూల‌కు దూర‌మ‌య్యారు. `మ‌మ్మ‌ల్నిఈ ఛాన‌ళ్లు, ప్రెస్సూ క‌వ‌ర్ చేయ‌క‌పోతేనే మేలు` అనుకొంటున్నారు. అలాంటి వారిలో న‌య‌న‌తార‌, హ‌న్సిక‌. త్రిష‌, స‌మంత‌.. ఇలా చాలామందే ఉన్నారు.

పొగిడినంత కాలం క‌థానాయిక‌ల‌కు బాగానే ఉంటుంది. `అదంట క‌దా, ఇదంట క‌దా` అంటూ గాసిప్పులు రాస్తేనే వాళ్ల‌కు బాధొచ్చేస్తుంటుంది. ఇటీవ‌ల స‌మంత - త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న ప్ర‌చారం ఊపందుకొంది. అవి చూసి స‌మంత తెగ గాభ‌రా ప‌డిపోయింద‌ట‌. `ఉన్న‌వీ లేనివీ ఎందుకు రాస్తారు.? దిస్ ఈజ్ టూ మ‌చ్‌` అంటూ ఆగ్ర‌హం వెల్లుబుచ్చింద‌ట‌. అందుకే ఇక నుంచి మీడియాకు వీలైనంత దూరంగా ఉండాల‌నుకొంటోంద‌ట‌.


ఇక న‌య‌న‌తార ముందు నుంచీ మీడియాకు దూరంగానే ఉంటోంది. ఈమ‌ధ్య అది మ‌రింత ఎక్కువైంది. ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో న‌య‌న ఎఫైర్ న‌డుపుతోంద‌ని, ఇద్ద‌రికీ ర‌హ‌స్యంగా పెళ్ల‌యిపోయింది గుస‌గుస‌లు వినిపించాయి. ఇద్ద‌రూ మ‌రీ టూమ‌చ్ క్లోజ్ గా ఉన్న ఓ సెల్ఫీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో... లేనిపోని అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాను ఎదురైతే మీడియా ఈ విష‌యాల‌పై ఎక్క‌డ గుచ్చి గుచ్చి అడుగుతుందో అని న‌య‌న భ‌య‌ప‌డుతోంది.



హ‌న్సిక మీడియాతో కాస్త ఫ్రెండ్లీగానే ఉండేది. ఇప్పుడు త‌ను కూడా `నో మీడియా` అంటోంది. ఎందుకంటే ఇటీవ‌ల అమ్మ‌డి సెల్పీలు కొన్ని బ‌య‌ట‌ప‌డ్డాయిలెండి. అందులో స‌గం న్యూడ్‌గా క‌నిపించింది. ఆ సెల్పీలు మీవేనా అని అడుగుతార‌ని ఆమె భ‌యం. దాంతో పాటు శింబుతో న‌డుపుతున్న ల‌వ్ ఎఫైర్ గురించీ మాట్లాడాల్సివ‌స్తుంద‌ని కంగారు ప‌డుతోంది. త్రిష కూడా అంతే. వ‌రుణ్తో ఎందుకు విడిపోయిందో చెప్పాల్సివ‌స్తుంద‌ని మీడియాకు వీలైనంత దూరంగా ఉంటోంది.

క‌థానాయిక‌ల అందాల్ని, వాళ్ల విజ‌యాల్ని పొగిడినంత కాలం.. వీళ్లంద‌రికీ మీడియా కావ‌ల్సివ‌చ్చింది. ఎప్పుడైతే.. వ్య‌క్తిగ‌త జీవితాల్లో మీడియా తొంగిచూడడం మొద‌లెట్టిందో వాటికి స‌మాధానాలు చెప్పాల్సివ‌స్తుంద‌ని ఇలా మీడియాకు దూరంగా ఉంటున్నారు. మ‌రి వీళ్లంద‌రికీ ప్ర‌సార‌మాధ్య‌మాల‌పై క‌రుణ ఎప్ప‌టికి క‌లుగుతుందో..?

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.