English | Telugu
వెలుగులోకి వచ్చిన మరో దిశ... శ్రీకాకుళంలో మైనర్ బాలికపై కామాంధుల కాటు
Updated : Jan 27, 2020
దిశా ఘటన జరిగి కొద్ది రోజులు కూడా గడవలేదు. ఆ దారుణమైన ఘటన మరువక ముందే ఏదో ఒక ప్రాంతంలో రోజుకొక ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. శ్రీకాకుళం జిల్లా , వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఒక మైనర్ ఇంటర్ విద్యార్థిని పై అత్యాచారం చేసి బాధితురాలిని హత్య చేశారు. అలా హత్య చేసిన తరువాత పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ధర్మపురం సమీపంలోని రైలు పట్టాల పై విద్యార్థిని మృతదేహాన్ని పడేశారు. పట్టాల పై మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ స్థలానికి వచ్చి పరిక్షించారు. బాధితురాలి గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు జరిగిన విచారణలో నిందితుడు కూడా పలాస మండలం సున్నాడకు చెందిన వ్యక్తిగా అనుమానస్తూ కాశీబుగ్గ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన పై పూర్తి వివరాల కొరకు దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.