English | Telugu
బ్యాంకుల ముందు చెత్త పనిపై కేంద్రం సీరియస్.. కమిషనర్ సస్పెన్షన్
Updated : Dec 28, 2020
ఈ సందర్భంగా పురపాలకశాఖ కమిషనర్ విజయ్కుమార్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది, కొంత మంది లబ్ధిదారులు కలిసి బ్యాంకుల ఎదుట చెత్త వేయడం బాధకరమని అన్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామన్నారు. ఈ ఘటనతో బ్యాంకు అధికారులు, సిబ్బంది మనోభావాలు గాయపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు విజయ్కుమార్ చెప్పారు. బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై విచారణ చేపట్టి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా తమ పరిదిలోని బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన పై మచిలీపట్నం కమిషనర్ శివరామకృష్ణ, విజయవాడ కమిషనర్ల ప్రసన్న వెంకటేష్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. అయితే ఈ చెత్త పనికి ప్రధాన కారణం కొంత మంది ఉన్నతాధికారుల ఆదేశాలేనని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్ల పర్వం ఇక్కడితో ఆగుతుందా లేక దీనికి బాధ్యులైన మరి కొందరు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి.