English | Telugu
మమ్మల్ని వద్దు అనే అధికారం ఎవరికీ లేదు
Updated : Oct 27, 2020
అనంతరం ట్విట్టర్ వేదికగా సంచయితకు ఉర్మిళ కౌంటర్ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా తన తండ్రి ఆనంద గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కోటపై నుంచి సిరిమానోత్సవాన్ని వీక్షిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం హాజరు కావడానికి సంశయించినా, సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడం ఇష్టంలేక వచ్చామని తెలిపారు. ఇక్కడికి వచ్చాక తమ కుటుంబ సభ్యులెవరూ లేరని గ్రహించామని, సంచయిత ఒత్తిడి కారణంగా మమ్మల్ని కోట విడిచిపెట్టమని సిబ్బంది కోరారని తెలిపారు. ఇతరులను అగౌరవపరిచే ప్రయత్నం మీ పాత్రను తెలుపుతోందంటూ సంచయిత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిమాను సంబరంలో పాల్గొనే హక్కు రాజవంశం కుటుంబ సభ్యులుగా తన తల్లికి, తనకు ఉందని, మమ్మల్ని వద్దు అనే అధికారం ఎవరికీ లేదు అని ఉర్మిళ గజపతిరాజు వ్యాఖ్యానించారు.