English | Telugu

సీఎం జగన్ కు ఉండవల్లి లేఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని అన్నారు. కరోనా బారిన పడితే జీవించలేమనే ఆవేదనలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో గెలవడానికి జగన్ కు బలాన్ని ఇవ్వమని ప్రార్ధిస్తున్నానని అన్నారు.

కరోనా రోగుల కోసం తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు అన్ని ఫంక్షన్ హాళ్లు స్వాధీనం చేసుకుని వాటిని ఎన్జీఓలు, ట్రస్ట్ లకు అప్పగించాలని సూచించారు. ఈ కేంద్రాలకు అయ్యే నిర్వహణ ఖర్చును ట్రస్టులు, ఎన్జీవోలు భరిస్తాయని.. ప్రభుత్వం వైపు నుంచి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే ఒక కళ్యాణ మండపం అద్దెకు తీసుకొని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతోందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులను కూడా కరోనా పరీక్షలకు అనుమతించి, ఫీజును ప్రభుత్వం నిర్ణయించాలని అన్నారు.