English | Telugu

భారత్ కు సారీ చెప్పిన అమెరికా

ప్రపంచం మొత్తం కరోనా ధాటికి విలవిల లుడుతోంది. ఐతే అమెరికాలో కరోనా తో పాటు నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో అట్టుడుకుతోంది. అమెరికాకు చెందిన ప్రధాన నగరాలలో అల్లర్ల కారణంగా కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు విగ్రహం పై ముసుగు కప్పారు. ఈ ఘటన పై యుఎస్ పార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఈ ఘటన పై అమెరికా రాయబారి కెన్ జస్టర్ భారత్ కు క్షమాపణలు చెప్పారు. ఇలా జరగడం పట్ల అమెరికా చింతిస్తోందని తమ క్షమాపణలను స్వీకరించాలని అయన భారత్‌ను కోరారు.