English | Telugu

విశాఖ ఆర్కే బీచ్ లో యువకుల గల్లంతు

విశాఖ ఆర్కే బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. నిన్నరాత్రి సమయంలో సుమారు ఐదుగురు విద్యార్ధులు కలిసి విశాఖ ఆర్కే బీచ్ సముద్ర స్నానానికి వెళ్ళారు. అయితే కాసేపటికే విషాదం ముంచుకు వచ్చింది. ఐదుగురు విద్యార్ధులలో ముగ్గురు విద్యార్థులు ఒడ్డుకు వచ్చారు. మరో ఇద్దరు విద్యార్ధులు గల్లంతైయ్యారు. అప్పటికప్పుడే బీచ్ దగ్గరలో ఉన్న పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని రక్షించేందుకు వెళ్ళారు. అయినప్పటికీ కూడా వారి ఆచూకీ తెలియలేదు. చీకటి పడటంతో వారి గాలింపు చర్యలు అక్కడితో ముగించడం జరిగింది. అయితే ఉదయం సుమారు ఆరు ఏడు గంటల ప్రాంతంలో విశాఖలో ఐటీఐ ప్రాంతానికి చెందిన భరత్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని పోస్టు మార్టంకి తరలించారు. మరొక విద్యార్ధి మోహిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే సముద్ర స్నానానికి సరదగా వెళ్ళిన ఈ విద్యార్థులకి ఈ విషాదం అలుముకుంది. వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడ ఉన్న పర్యాటకులు మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపడుతున్నప్పటికి కూడా విని తగు జాగ్రత్తలు ఎవరూ‌ తీసుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో సముద్ర స్నానానికి వెళ్ళి గల్లంతైన విషయం కొంచం తగ్గినట్టు అనిపించినా ఈ రెండు నెలలలోనే సూమారు మూడు నాలుగు ఘటనలు చోటుచేసుకున్నాయి. మోహిత్ అనే విద్యర్ధి కోసం ఒక పక్క కోస్ట్ గార్డ్ మరోపక్క జాలర్లు ఇద్దరు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.