English | Telugu

ముంబయి చేరుకోనున్న విదేశాల్లోని తెలుగు ప్రజలు! హోటళ్ల‌లో 1000 గదులు సిద్ధం చేసిన ఏపీ స‌ర్కార్‌

విదేశాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు పెయిడ్ క్వారంటైన్ కు తరలించ‌నున్నారు. వారి కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో హోటళ్లు, లాడ్జీల్లో 1000 గదులు సిద్ధం చేసింది. 14 రోజుల తర్వాత నెగెటివ్ వస్తే ఇళ్లకు పంపిస్తారు. అవసరాన్ని బట్టి 28 రోజుల వరకు క్వారంటైన్ పెంచే అవకాశం ఉంది. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.

64 ప్రత్యేక విమానాల ద్వారా విదేశాల్లోని భారతీయులను తీసుకురావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది.
అందులో వున్న తెలుగువారిని ముంబయి నుంచి హైదరాబాద్, గన్నవరంకి తరలిస్తారు. ఈ క్రమంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారు సోమవారం నాటికి ప్రత్యేక విమానాల్లో ముంబయి చేరుకోనున్నారు. వారిని ముంబయి నుంచి హైదరాబాదుకు, గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించనున్నారు.