English | Telugu

టీవీ 5 కార్యాలయం పై దాడిని ఖండించిన లోకేష్!

హైదరాబాద్ టీవీ 5 కార్యాలయం పై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. టీవీ 5 కార్యాలయం పై రాళ్ల దాడి పిరికిబంద చర్య అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని ఆయ‌న అన్నారు.

పత్రికా స్వేచ్చని హరించే విధంగా జరుగుతున్న సంఘటనల పై మీడియా ఐక్యంగా పోరాటం చెయ్యాలి లేకపోతే ఇలాంటి పరిస్థితి అందరికి వచ్చే ప్రమాదం ఉంది లోకేష్ అభిప్రాయ‌ప‌డ్డారు.

అన్ని రాజకీయ పార్టీలు మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులను తీవ్రంగా ఖండించి భావ ప్రకటనా స్వేచ్చని కాపాడటానికి ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని లోకేష్ విజ్ఞ‌ప్తి చేశారు.