English | Telugu

టెక్కలి లో రాజకీయ ఉద్రిక్తత

శ్రీకాకుళం జిల్లా టెక్కలి పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చాకిపల్లి గ్రామంలో టిడిపి సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు నిలిపి వేయడంతో గ్రామస్తులు వాలంటీర్లను నిలదీశారు. దీంతో ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. వాలింటర్ల ఫిర్యాదుతో పలువురు టిడిపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టిడిపి సానుభూతిపరుల అరెస్టు పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసు అధికారులు పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. అన్యాయంగా అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. మరోవైపు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు టెక్కలి పీఎస్ ఎదుట నిరసనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన టిడిపి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి నుంచి తెల్లవార్లూ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. చాకిపల్లిలో జరిగిన ఘటన నిన్న సాయంత్రం నుంచి కూడా వివాదం చిలికి చిలికి గానివానగా మారింది. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డులు అదే విధంగా గ్రామానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి టిడిపి సానుభూతిపరులకు ఇవ్వటం ఆపేశారు. దానికి గ్రామ వాలంటీర్లు వంత పాడినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్ ,మాజీ ఎంపీటీసీ వసంతరావు వీళ్లిద్దరూ కూడా వాలంటీర్లను నిలదీశారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి గలాటా నేపథ్యంలో వారిద్దరిని కూడా టెక్కలి పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళారు. మొత్తానికి టెక్కలి పోలీస్ స్టేషన్ దగ్గర హైడ్రామా నడిచిందని సమాచారం. ఎందుకంటే భారీగా పోలీసుల మోహరింపు మరోవైపు టిడిపి కార్యకర్తలు కూడా అదే విధంగా భారీగా మోహరించారు. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఆ నేపథ్యంలో కార్యకర్తలకు అండగా నిలిచేందుకు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఇంక ఈ హైడ్రామా ఎటు మలుపు తిరగబోతుందో వేచి చూడాలి.