English | Telugu

మాకు అధికారం ఇస్తే రాజధాని అక్కడే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ 

ఏపీ రాజధానిపై ఇప్పటివరకు ప్రజలను పెద్ద కన్ఫ్యూషన్ లో ఉంచిన ఏపీ బీజేపీ ఫైనల్ గా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ అంశం పై స్పందిస్తూ ప్రజలు మాకు అధికారం ఇస్తే అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని... అంతేకాకుండా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ లు పోను మిగిలిన 9000 ఎకరాలలో రాజధానిని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేసారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ నేతలు ఈ విషయం పై ఎవరికీ తోచినట్లుగా వారు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాజధాని విషయంలో ఏపీలోని బీజేపీ నాయకులు ఒక మాట చెప్పగానే ఢిల్లీ నుండి జివిఎల్ వంటి వారు దానిని ఖండించడం మనం చూసాం. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనతోనైనా ఈ దాగుడుమూతలకు తెర పడుతుందేమో చూడాలి.