English | Telugu
ఆర్నాబ్ సంగతి సరే.. మరి ఆ జర్నలిస్టుల మాటేంటి.. బీజేపీకి శివసేన సూటి ప్రశ్న
Updated : Nov 5, 2020
మరి బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు ఒక జర్నలిస్టును అరెస్ట్ చేశారని, అదే ఉత్తరప్రదేశ్ లో ఏకంగా జర్నలిస్టులను చంపేశారని ఆ పత్రిక తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఈ సంఘటనలు ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాయని బీజేపీ నేతలు ఎవరూ ఎందుకు అనలేదని శివసేన ఈ సందర్భంగా ఎద్దేవా చేసింది. అంతేకాకుండా అర్నాబ్ వల్ల ఒక అమాయక వ్యక్తి, అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నారని... తమకు న్యాయం చేయాలని ఆ మృతుడి భార్య డిమాండ్ చేస్తోందని సామ్నా ద్వారా శివసేన తెలిపింది. అయినా పోలీసులు వారి పని వారు చేసుకుంటున్నారని కూడా శివసేన స్పష్టం చేసింది.