English | Telugu
సోము వీర్రాజుది వైసీపీ స్క్రిప్టు! వాస్తవాలు చెప్పాలన్న జవహర్
Updated : Nov 5, 2020
రాజమండ్రిలో ఉదయం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబే పోలవరం కాంట్రాక్టరుగా ఉన్నారని గతంలో ఒక కేంద్ర మంత్రే వ్యాఖ్యానించారని చెప్పారు. 48 వేల కోట్ల మేర అంచనాలు ఇష్టారీతిన పెంచేశారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరని, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లో భారీ అవినీతి చోటు చేసుకుందని వీర్రాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం ప్రైవేటు భూములుగా చూపించిందని, గత ప్రభుత్వం పోలవరం కాంటూరు లెవెల్స్ పెంచేసిందని చెప్పారు. దీంతో దేవీపట్నం మునిగిపోయిందన్నారు సోము వీర్రాజు. పోలవరం డబ్బుతో ఒక టీడీపీ ఎమ్మెల్యే మూడు అపార్ట్మెంట్లు కట్టారని, 10 కోట్లతో విజయవాడలో భారీ గెస్ట్ హౌస్ కట్టారని సోము వీర్రాజు ఆరోపించారు.