English | Telugu
సిట్ పై స్టే ఎత్తివేతకు సుప్రీం కోర్టు నిరాకరణ.. జగన్ సర్కార్ కు మరో ఎదురు దెబ్బ
Updated : Nov 5, 2020
ఏపీ హైకోర్టు గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో, దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలపై స్టే విధిచింది. ప్రభుత్వం చెబుతున్న నేరాలకు సంబంధించిన దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని, అంతేకాకుండా మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించే ఆధారాలు కూడా లేవని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎప్పుడైనా ఫిర్యాదు చేశాకే నేరం నమోదవుతుందని.. కానీ ఇక్కడ నేరం నమోదు కావడానికి ముందే దర్యాప్తు చేయడంతో పాటు ఆయా నేరాలను విభాగాలుగా మార్చడం దగ్గర్నుంచి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అభ్యర్థించడం వరకు అన్నీ లోపభూయిష్టమేనని హైకోర్టు ఆక్షేపించింది. దీంతో నాలుగు వారాల తర్వాత సుప్రీంకోర్టులో జరిగే విచారణతో ఈ సిట్పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.