English | Telugu
టీడీపీ గుట్టు విప్పిన 'సజ్జలోపాఖ్యానం'
Updated : Apr 8, 2020
* మాజీ మంత్రి గంట ఆ విషయం లో హర్ట్ అయ్యారని సజ్జల వ్యాఖ్య
ఇంతకీ సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పే ఆ శ్రీనివాసులు నాయుడు ఎవరు? ఆయన, అప్పటి హెచ్ ఆర్ డీ మంత్రి గంట శ్రీనివాసరావుని కూడా పక్కన పెట్టి మరీ, యూనివర్సిటీ పాలక మండళ్లను నియమించారా? ఈ విషయం లో అప్పటి సి ఎం చంద్రబాబు నాయుడు కు, గంటా శ్రీనివాసరావుకు మధ్య నిజంగానే గ్యాప్ పెరిగిందా? శ్రీనివాసులు నాయుడు నిజంగా అంత తురుమ్ ఖానా? అవుననే అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. వివరాలన్నీ అయన మాటల్లోనే వినండి.
రాష్ట్రం లోని యూనివర్సిటీలను విద్యాపరంగా అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి పాలక మండళ్ళను నియమించినట్టు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం, అలాగే ఆ పార్టీ కి వంత పడుతున్న కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డ సజ్జల, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల పాలక మండలి నియామకం తొలిసారి జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
"దేశ చరిత్రలో తొలిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి 50 రిజర్వేషన్లతో యూనివర్సిటీ పాలక మండలి పోస్టులు భర్తీ చేశారు. బీసీ, ఎస్సి ,ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం మేరకు పాలక మండలిలో అవకాశం కల్పించారు.. పాలక మండలిలో మహిళలకు సైతం 50 శాతం మేర అవకాశం కల్పించారు.సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశ్యం తో సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 యూనివర్సిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు దాటి బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు. 116 మంది పాలకమండలి సభ్యులకు గాను 58 మంది మహిళలకు సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్దానం కల్పించారు. పాలకమండలి సభ్యుల నియామకాలకు సంబంధించి ప్రజాస్వామ్యబద్దంగా,ఎవరైతే అప్లయ్ చేసుకున్నారో వారి అర్హతలను ఉన్నత విద్యకు సంబంధించి ప్రత్యేక కమిటి పరిశీలించింది. 390 మంది దరఖాస్తు చేసుకుంటే వారిని అన్ని విధాలా వడపోత పోసి యూనివర్శిటిల అభివృధ్దికి దోహదపడేవారిని 116 మందిని నియమించారు. మా నాయకులు సిఫార్స్ చేసారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నియమితులైన సభ్యులలో అందరూ కూడా ఆయా రంగాలలో నిష్ణాతులే పైగా రిజర్వేషన్ లకు లోబడి నియమించబడ్డవారు. ఉన్నత విద్యావంతులు, సమాజంలో ఆయా రంగాలలో ఉన్నతమైన వ్యక్తులను పాలకమండలి పదవుల్లో నియమించారు.. పాలక మండలి సభ్యులు నియామకం పై టీడీపీ నేతలు తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు," అని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.
పాలకమండళ్ల నియామకాలలో సామాజిక న్యాయం పాటించడాన్ని పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని, మూడు రోజుల నుంచి పసిరికా పాముల పచ్చ మీడియా తప్పుడు వార్తలు వండివారుస్తోందని, ప్రపంచ మంతా కరోనా వైరస్ గురించి ఆలోస్తుంటే పచ్చమీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని , లాక్ డౌన్ ఉందని రాజకీయ పాలక మండలి అంటూ మెడకాయమీద తలకాయలేని వార్తలు రాస్తున్నారని సజ్జల మండిపడ్డారు.
"కరోనా లాంటి మహమ్మారి నేపథ్యంలో మేము మంచి పని చేసి కూడా చెప్పలేకపోయము. కరోనా ను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న తీరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందిముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పని చేయడమే తప్ప ప్రచారం అలవాటు లేదు. పాలకమండలికి సంబంధించి అన్ని పదవులు అర్హులకే కట్టబెట్టారు.యూనివర్సిటీ పాలక మండలి పోస్టుల భర్తీ విషయంలో రిజర్వేషన్లు ఖచ్చితత్వం పాటించాలని సీఎం ఆదేశించారు.మహిళ రిజర్వేషన్లు విషయంలో రెండు పోస్టులు తగ్గితే సీఎం వైయస్ జగన్ ఒప్పుకోలేదు.రిజర్వేషన్లు ప్రకారం మహిళలకు, బడుగు, బలహీన వర్గాలకు పదవులు దక్కవలసిందేనని సీఎం స్పష్టంగా చెప్పారు.చంద్రబాబు హయాంలో 11 యూనివర్సిటీల పాలక మండలి భర్తీలో పదవులను నామినేటెడ్ పద్దతిలో నియమించారు.దాని కోసం ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు.ఇప్పటి పాలకమండలి నియామకానికి ప్రత్యేకంగా ఓ కమిటిని మా ప్రభుత్వం నియమించింది.చంద్రబాబు హయాంలో అయితే క్లాస్ మేట్ శ్రీనివాసులు నాయుడు తయారు చేసిన పాలక మండలి సభ్యులు జాబితాను చంద్రబాబు ఆమోదించారు.శ్రీనివాసులు నాయుడు కు ఏ అర్హత ఉందని పాలకమండలి సభ్యులను నియమించారో కూడా తెలియదు.దీనిపై ఎల్లో మీడియా అప్పడు ఎందుకు వార్తలు రాయలేదు. అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు కు కూడా తెలియకుండా యూనివర్సిటీ పాలక మండలి సభ్యులను నియమించారు.ఈ విషయం అప్పట్లో అందరికి తెలిసిందే.చంద్రబాబు హయాంలో పాలకమండలి సభ్యుల నియామకాల్లో తప్పులు జరిగితే ఎల్లో మీడియా గాడిదలు కాసిందా. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులుపై పచ్చమీడియా ఎందుకు నోరు మెదప లేదంటూ" సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రశ్నించారు.