English | Telugu
జీ బ్లాక్ కింద నిజాం ఖజానా.. కేసీఆర్ ఆ 11 రోజులు ఎక్కడికి పోయారు?
Updated : Jul 14, 2020
ఇక సచివాలయం చుట్టూ 3 కిలోమీటర్లు రాకపోకలు బంద్ చేసి కూల్చివేతలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై అనుమానం రావడంతో ఎంక్వైరీ చేయగా.. నిధి అన్వేషణ జరుగుతుందనే విషయాలు తెలిశాయన్నారు. జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందనే వార్తలను గతంలో పత్రికలు ప్రచురించాయని, అక్కడ అన్వేషణ కోసం అవకాశం ఇవ్వాలని గతంలో పురావస్తు శాఖ జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాసిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అక్కడే తవ్వకాలు జరపడంపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా పగలే చేస్తారని, గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చేస్తారని ఆరోపించారు. కూల్చివేతకు ముందు జి బ్లాక్ కింద పురావస్తు శాఖ చేత పరిశోధన జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి ఒక కమిటీ వేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.