English | Telugu
మహానగరంలో విలయంపై 'రంగం'లో మహంకాళి ముందే హెచ్చరించింది..
Updated : Oct 19, 2020
అయితే ఈ విపత్తు గురించి బోనాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ వద్ద జరిగే భవిష్యవాణి "రంగం"లో అమ్మవారు పూనిన మహిళ స్వర్ణలత ముందే హెచ్చరించింది. "గంగ వస్తుంది రా.. అంతా కొట్టుకుపోతుంది, ఇంక మీరు ఆలోచించేది లేదు. నేను చెప్పేది లేదు. ఏడుగురు అక్కాచెల్లెళ్లం.. ఆగమేఘాల మీదున్నాం. చిన్నా, పెద్దా, ముసలి, ముతకా అందరూ జాగ్రత్తగా ఉండాలని" ఆ రంగంలో స్వర్ణలత ఛేప్పారు. అంతేకాకుండా ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదని" ఆమె హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ సంవత్సరం జరిగిన రంగంలో ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.