English | Telugu
టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమవ్వలేదా?.. రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు
Updated : Jul 31, 2020
మరోవైపు బీఎస్పీ నుంచి ఎన్నికై కాంగ్రెస్ లో విలీనమైన ఆరుగురు ఎమ్మెల్యేల చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతోంది. ఇప్పటికే వారి విలీనాన్ని సవాల్ చేస్తూ బీఎస్పీ హై కోర్ట్ ని ఆశ్రయించింది. బీజీపీ కూడా ఈ విలీనాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్.. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడాన్ని ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని తప్పుపడుతున్నారని, టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు రాత్రికి రాత్రి బీజేపీలో విలీనమయ్యారని.. ఈ విలీనాన్ని మాత్రం బీజేపీ సరైందని వాదిస్తుందని విమర్శించారు. రాజస్థాన్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనాన్ని మాత్రం తప్పంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.