English | Telugu

అర్ధరాత్రి భయంతో నిర్ణయాలు వద్దు.. జగన్ కి రాఘురామకృష్ణం రాజు సూచన

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మళ్లీ నియమించడం ఆలస్యమైనా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ రాఘురామకృష్ణం రాజు అన్నారు. ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరిచేసుకోవాలని సూచించారు. మన దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి అనుసంధానమై ఉంటాయని.. ఒక వ్యవస్థ గాడి తప్పినా చాలా సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఎస్ఈసీ విషయంలో జరిగిన తప్పిదాలతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో చూశామని, కోర్టుల కోసం ఎంతో ప్రజాధనం వృథా అయిందని అన్నారు.

అయితే, తెల్లారితే ఈ అంశంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులకు జైలుశిక్ష పడుతుందనే భయంతో.. అర్ధరాత్రి పూట నిర్ణయాలు తీసుకోవడం కాకుండా.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ కు రాఘురామకృష్ణం రాజు సూచించారు. న్యాయ వ్యవస్థను గౌరవించాలని.. భయంతో మనం నిర్ణయాలు తీసుకున్నట్టు ఉండకూడదని, ఇకపై ఇలా జరగకుండా మనం వ్యవహరించాలని అన్నారు.