English | Telugu

వైసీపీ షోకాజ్ నోటీసుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు రియాక్షన్

ఎమ్మేల్యేల పైన, పార్టీ అధినాయకత్వం పైన తీవ్ర వ్యాఖ్య‌లు చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం షోకాజు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు షోకాజు నోటీసు జారీ చేయడంపై రఘరామకృష్ణంరాజు స్పందించారు. ఏ నాడు పార్టీని కానీ, పార్టీ అధ్యక్షుణ్ని కానీ పల్లెత్తు మాట అనలేదన్నారు. ప్రజల కోసం చేపట్టిన పథకాలు అనుకున్నట్టుగా జరగడంలేదని.. సీఎంకి చెప్పాల్సిన విషయాలు వీడియో ముఖంగా చెప్పానని తెలిపారు. సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తే దొరకలేదని పేర్కొన్నారు. అపాయింట్‌మెంట్‌ దొరకని కారణంగానే మీడియా ముఖంగా సూచ‌న‌లు చేసినట్టు వివ‌రించారు. త‌న‌కు నోటీసుపై వివ‌ర‌ణ‌కు వారం రోజులు సమయం ఉన్నా రేపు సమాధానం చెబుతానని రఘరామకృష్ణంరాజు పేర్కొన్నారు.