English | Telugu
కరోనా డేంజర్ బెల్స్... లక్షణాలు లేని రోగులతో మరింత ప్రమాదం
Updated : Sep 21, 2020
ఎటువంటి లక్షణాలు లేని రోగుల్లో ఇటు వైరస్ లోడు అధికంగా ఉండడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా అదే స్థాయిలో ఉండడంతో వారంతా బయటకు ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంటారని ఈ తాజా సర్వేలో తేలింది. ఈ రోగుల నుండి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకి వారి మరణానికి కారణమవుతున్నట్టు తాజా సర్వే లో తేలింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ అని నిర్ధారణ అవుతోంది. మిగిలిన 30 శాతం మందిలోనే కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తున్నాయి. దీంతో వైరస్ లోడు ఎక్కువగా ఉండే అసింప్టమాటిక్ రోగుల నుండి పిల్లలు, వృద్ధులకు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.