English | Telugu

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో నిర్మలమ్మ

ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మేగజైన్‌ విడుదల చేసిన ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో పలువురు భారతీయ వనితలకూ చోటు దక్కింది. ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో తొలి స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ కు నిలిచారు. ఇక భారత్ కు చెందిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (41 వ స్థానం), టెక్ దిగ్గజం హెచ్సీఎల్ సీఈఓ రోష్నీ నాడార్‌ మల్హోత్రా(55), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(68) లకు స్థానం లభించింది. ఈ జాబితాలో అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ కూ స్థానం దక్కింది. ఇక యూరప్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్‌ లగార్డే వరుసగా రెండో ఏడాది కూడా రెండోస్థానంలో నిలవడం విశేషం. 10 దేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, 38 కంపెనీల సీఈవోలు, వినోద రంగానికి చెందిన ఐదుగురు ప్రముఖులనూ ఫోర్స్బ్ తన జాబితాలో శక్తిమంతమైన మహిళలుగా పేర్కొంది.