English | Telugu
కొత్త కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్.. రెండు రోజుల్లో 6 లక్షల కోట్లు ఢమాల్
Updated : Dec 22, 2020
నిన్న భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. ఈరోజు ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయి 0.60 శాతం నష్టంతో 45,240 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. దీంతో రెండు సెషన్ల వ్యవధిలోనే స్టాక్ మదుపరులు దాదాపు రూ. 6 లక్షల కోట్లను నష్టపోయినట్లయింది. ఇక ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే, 0.76 శాతం పడిపోయి 13,220 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.