English | Telugu
పుస్తకాలు, స్టేషనరీ షాపులు, ఎలక్ట్రికల్ దుకాణాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు
Updated : Apr 23, 2020
ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. గ్రామీణ ఆర్ఠిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశంలో వైద్య సిబ్బందికి పూర్తి భద్రతను కల్పిస్తామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా నోడల్ అధికారులను నియమిస్తామని తెలిపారు.
వీటికే మినహాయింపులు..పుస్తకాలు, స్టేషనరీ షాపులు, నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్ షాపులు, మొబైల్ రిచార్జ్ షాపులు, ఆటా కంపెనీలు, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత, ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్ దుకాణాలు, సిమెంట్ విక్రయాలకు అనుమతి, పిండి మిల్లులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది.