English | Telugu
అన్నదమ్ముల్లా ఉన్న మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు: లోకేష్
Updated : Jun 9, 2020
"వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ గారికి మ్యాటర్ వీక్ అనే విషయం పేటిఎమ్ బ్యాచ్ కి అర్థం అయిపోయింది. అందుకే 5 రూపాయిల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి టిడిపి అధ్యక్షుడు ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లతో రచ్చ చేస్తున్నారు." అంటూ ఎద్దేవా చేశారు.
"అన్నదమ్ముల్లా ఉన్న నాకు,ఎంపీ రామ్మోహన్ నాయుడికి మధ్య గొడవలు పెట్టాలని ప్రయాస పడుతున్న పేటిఎం బ్యాచ్ ఆవేశానికి నా సానుభూతి. మీ ప్రయత్నాలు టిడిపి నాయకుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. టిడిపిలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమే అని విషయం వైకాపా పేటిఎమ్ బ్యాచ్ కి గుర్తుచేస్తున్నాను." అని లోకేష్ పేర్కొన్నారు.