English | Telugu
జగన్ గారి పబ్లిసిటీ పిచ్చి తప్ప మహిళలకు న్యాయం ఎక్కడ?
Updated : Aug 4, 2020
కేసు నమోదు చెయ్యడానికి గిరిజన సంఘాలు ఉద్యమం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, బాధిత మహిళలకు జగన్ రెడ్డి గారి పాలనలో ఎంత అన్యాయం జరుగుతోందో అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అని లోకేష్ డిమాండ్ చేశారు.
కాగా, కర్నూలు జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు భర్తతో కలిసి గాలేరు వంతెన వద్ద నిద్రిస్తుండగా ముగ్గురు యువకులు ఆమె భర్తపై దాడిచేసి, ఆమెను ముళ్ల పొదల్లోకి ఈడ్చుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ కేసుపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని బాధితురాలి భర్త, బంధువులు ఆరోపిస్తున్నారు.