English | Telugu
దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు
Updated : Aug 29, 2020
రాష్ట్రంలో వైఎస్ జగన్ రౌడీ రాజ్యం నడుస్తుంది అని లోకేష్ విమర్శించారు. రోజుకో దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమత్తు పని చేస్తున్న దళితుడైన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్ పై వైసీపీ నాయకుడు రమేష్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడాడు.. అంటూ, దీనికి సంబంధించిన వీడియోను లోకేష్ షేర్ చేశారు.
శిరోముండనం, చంపడం, వేధింపులు, దాడులకు పాల్పడుతూ దళితుల పై దమనకాండ కొనసాగిస్తున్నారు జగన్ రెడ్డి అని విమర్శించారు. దళితులపై దాడులకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు.