English | Telugu

గవర్నర్ తో సీఎం భేటీ

రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ లో ముఖ్యమంత్రి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుల నియామకంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మూడుస్థానాలు ఖాళీ కావడంతో అసెంబ్లీ సమావేశాల లోగా వాటిని భర్తీ చేయాల్సి న విషయంపై చర్చజరిగినట్లు సమాచారం.

సచివాలయం నూతన సచివాలయం నిర్మాణం పై కూడా ముఖ్యమంత్రి గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, ప్రాజెక్టుల్లో పెరిగిన నీటిసామర్ధ్యం, వరద సహాయ చర్యలపై చర్చించారు. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండల సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసే అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై గవర్నర్ కు వివరించారు. గవర్నర్ ను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా ఉన్నారు.