English | Telugu

తాము అరిచేవాళ్లం కాదు కరిచేవాళ్లం.. బాలయ్య అన్నది ఆ కుక్కనేనా?

ఈ రోజు రాజ్యసభ ఎన్నికల కోసం ఏపీ అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతోంది. ఈ సందర్బంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఓటింగ్ లో టీడీపీ ఎమ్మెల్యేలు అందరికంటే ముందు బాలకృష్ణ తన ఓటుహక్కును వినియోగించుకొన్నారు. ఐతే అయన ఓటు వేయడానికి టిడిఎల్పీ కార్యాలయ సిబ్బందితో కలిసి వెళుతున్న సమయంలో ఓ కుక్క అరిచింది. దీంతో తన ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి వస్తూ పక్కనున్న వారితో తాము అరిచేవాళ్లం కాదని... కరిచేవాళ్లమని అన్నారు. తాజాగా అయన చేసిన ఈ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఐతే ఆయన కేవలం కుక్క అరవడంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక మరేదైనా ఉద్దేశ్యంతో ఇలా అన్నారా అని ప్రస్తుతం అందరు దీని పై చర్చించుకుంటున్నారు.